సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్నది. (Himachal crisis) కాంగ్రెస్ రెబల్స్ ఎమ్మెల్యేలతో సహా 11 మంది శాసనసభ్యులు బీజేపీ పాలిత ఉత్తరాఖండ్కు చేరుకున్నారు. హర్యానా నంబర్ ప్లేట్తో కూడిన బస్సు శనివారం ఉదయం రిషికేశ్లోని తాజ్ హోటల్కు చేరుకున్నది. కాంగ్రెస్కు చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఈ బస్సు నుంచి దిగారు. హిమాచల్ ప్రదేశ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఇంకా ముగియలేదన్న సంకేతాలు ఇచ్చారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు రెండు రోజుల కిందట ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను ఆయన కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, లోక్సభ ఎన్నికలపై నివేదికలు ఇచ్చారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్స్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.