కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కలిసి తెలంగాణ (Telangana) ను ఆంధ్రా (Andhra) లో కలుపడం ఖాయమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ( MLA Padi Kaushik Reddy) ఆరోపించారు.
కరీంనగర్ బీఆర్ఎస్ (BRS) ఎంపీగా బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని కోరుతూ జమ్మికుంట మండలం వావిలాలలో నిర్వహించిన ఎన్నికల రోడ్ షో ( Road show ) లో ఆయన మాట్లాడారు.
అనతికాలంలోనే ప్రజల్లో కాంగ్రెస్ (Congress) పట్ల వ్యతిరేక భావం పెరిగిపోయిందని పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ (Vinod Kumar) భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారని ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాయ మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ కు వస్తున్నా ప్రజాదరణను చూసి భయపడి కాంగ్రెస్ నాయకులు జమ్మికుంటలో సభ పెట్టారని విమర్శించారు. రైతులకు సాగునీరు. రైతుబంధు, పెన్షన్లు రావాలంటే మళ్లీ కేసీఆర్(KCR ) రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, కేడీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్, ఎంపీపీ దొడ్డి మమత ప్రసాద్, ఎంపీటీసీ మల్లేశం, వైస్ ఎంపీపీ తిరుపతి రావు, కో ఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ రావు, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రావు , వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.