MS Dhoni – Rashid Khan | 2023 ప్రపంచకప్లో భాగంగా సోమవారం (అక్టోబర్ 23) చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇక గత రెండు మ్యాచ్లలో ఓటమిపాలైన పాకిస్తాన్ ఈ మ్యాచ్లో అయిన గెలిచి వరల్డ్ కప్ రేస్లో సత్తా చాటాలని చూస్తుంది. ఇదిలా ఉంటే.. ఇరుజట్లు ఇప్పటికే చెన్నై చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి.
కాగా.. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనిని చెన్నైలో కలిశాడు. ధోనీ గత కొన్ని రోజులుగా చెన్నైలో ఉంటున్న విషయం తెలిసిందే. యాడ్ షూటింగ్లో భాగంగా ధోనీ చెన్నైలో ఉంటున్నాడు. దీనికి సంబంధించి ఈ మధ్యే తమిళ కమెడియన్ యోగిబాబుతో దిగిన ఫొటో వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ – అఫ్గానిస్థాన్ మ్యాచ్ కోసం చెన్నై చేరుకున్న ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రీసెంట్గా ధోనిని కలుసుకున్నాడు. ఈ విషయాన్ని రషీద్ ట్విట్టర్లో తెలుపుతూ.. మహీ భాయ్ మిమ్మల్ని కలవడం ఎల్లప్పుడూ నాకు ఆనందంగా ఉంటుది. అంటూ రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది.
Always a pleasure to meet you Mahi bhai 😊@msdhoni pic.twitter.com/HqUPlMIfdD
— Rashid Khan (@rashidkhan_19) October 21, 2023
ఇక 2023 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా జరిగే 22వ లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ జట్లు అక్టోబర్ 23న ఢీకొనబోతున్నాయి.