బయో బబుల్లో మ్యాచ్లు
అహ్మదాబాద్: కరోనా వైరస్ కారణంగా గత రెండేండ్లుగా రద్దవుతూ వస్తున్న ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. పటిష్ట ఏర్పాట్ల మధ్య రెండు దశలుగా సాగనున్న ఈ మెగా టోర్నీ తొలి అంచెకు గురువారం తెరలేవనుండగా.. 9 వేదికల్లో మ్యాచ్లు జరుగనున్నాయి. భారత టెస్టు జట్టులో స్థానం నిలబెట్టుకోవాలంటే సత్తాచాటాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ మెగాటోర్నీ బరిలోకి దిగనున్నారు. మొత్తం 38 జట్లు ఇప్పటికే బయో సెక్యూర్ వాతావరణంలో ఉండగా.. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ సౌరాష్ట్రతో 41 సార్లు ట్రోఫీని కైవసం చేసుకున్న ముంబై తలపడనుంది. ఈ రెండు జట్లలో పుజారా, రహానే చెరోవైపు ఉండటంతో మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. తొలి దశ పోటీలు ముగిసిన తర్వాత ఐపీఎల్ జరుగనుండగా.. మే 30 నుంచి నాకౌట్ పోటీలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ జట్టు లీగ్ దశ మ్యాచ్లకు కటక్ ఆతిథ్యమిస్తుండగా.. తొలి పోరులో చండీగఢ్తో మన కుర్రాళ్లు తలపడనున్నారు.