రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ చరిత్ర సృష్టించింది. 41 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టును మట్టి కరిపించి తమ తొలి టైటిల్ ముద్దాడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్ (134), యశస్వి జైస్వాల్ (78), కెప్టెన్ పృథ్వీ షా (47) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 378 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన మధ్యప్రదేశ్కు యష్ దూబే (133) అదిరిపోయే ఆరంభం అందించాడు. ఆ తర్వాత శుభమ్ శర్మ (116), రజత్ పటీదార్ (122) కూడా బ్యాటు ఝుళిపించారు. చివర్లో శరన్ష్ జైన్ (57) కూడా రాణించడంతో మధ్యప్రదేశ్ జట్టు 536 పరుగులకు ఆలౌట్ అయింది.
రెండో ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ స్పిన్నర్ కుమార కార్తికేయ నాలుగు వికెట్లతో చెలరేగడంతో ముంబై జట్టు కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో మధ్యప్రదేశ్ ఆటగాడు హిమాన్షు మంత్రి (37) మంచి ఆరంభమే ఇచ్చినా.. వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
ఇలాంటి సమయంలో మరోసారి రజత్ పటీదార్ (30 నాటౌట్) జట్టును ఆదుకున్నాడు. 30వ ఓవర్లో విన్నింగ్ రన్స్ చేసి తమ జట్టుకు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ అందించాడు. సిరీస్ ఆసాంతం బ్యాటుతో చెలరేగిన సర్ఫరాజ్ ఖాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. రెండు ఇన్నింగ్స్లలో రాణించిన శుభమ్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్దు లభించింది.