న్యూఢిల్లీ: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తాజా సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 5 గ్రూపుల్లో.. 38 జట్లు తలపడుతున్నాయి. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ ప్లేయర్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా వంటి వారితో పాటు.. టీమ్ఇండియా గడప తొక్కేందుకు సిద్ధంగా ఉన్న యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మయాంక్ అగర్వాల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, అర్జాన్, జైదేవ్ ఉనాద్కట్, మానవ్ సుతార్, తిలక్వర్మ వంటి వాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. దేశవాళీల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న హైదరాబాద్ ప్లేట్ గ్రూప్ నుంచి పోటీ పడుతున్నది. నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, మిజోరాంతో తలపడనున్నది.