హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. మూడు మ్యాచ్ల్లోనూ మన జట్టు ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందగా.. అన్నీ మ్యాచ్లూ రెండు రోజుల్లోనే ముగియడం గమనార్హం. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో సిక్కింను చిత్తుచేసింది.
కెప్టెన్ తిలక్ వర్మ (103 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), తన్మయ్ (137) సెంచరీలు బాదడంతో హైదరాబాద్ 463/4 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సిక్కిం.. రెండో ఇన్నింగ్స్లో 186 పరుగులకు కుప్పకూలింది.