INDU19 vs USA19 : పురుషుల అండర్ -19 ప్రపంచకప్లో భారత జట్టు తొలి మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. యూఎస్ఏను 107 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. కానీ, నాలుగు ఓవర్లు పూర్తి కాగానే వాన మొదలైంది. దాంతో.. అంపైర్లు ఆటను నిలిపివేశారు. వర్షం పడే సరికి భారత్ స్కోర్.. 21-1.
అండర్ -19 వరల్డ్కప్లో విజయం దిశగా సాగుతున్న భారత జట్టు ఇన్నింగ్స్కు వరుణుడు అడ్డుపడ్డాడు. బులవాయాలోని స్పోర్ట్స్ క్లబ్లో యూఎస్ఏను 107కే ఆలౌట్ చేసిన టీమిండియా.. ధనాధన్ ఆటతో ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(2) నిరాశపరచగా.. వేదాంత్ త్రివేది(నాటౌట్), కెప్టెన్ అయుష్ మాత్రే(15 నాటౌట్)లు విధ్వంసక బ్యాటింగ్తో యూఎస్ బౌలర్లను బెంబేలెత్తించారు. నాలుగో ఓవర్ పూర్తయిందో లేదో వీరి జోరుకు బ్రేక్ ఇస్తూ వరుణుడు స్టేడియాన్ని ముంచెత్తాడు. దాంతో.. అంపైర్లు ఆటను నిలిపివేయగా.. మైదాన సిబ్బంది పరుగున వచ్చి పిచ్ను ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు.
Innings Break!
Henil Patel’s brilliant figures of 5️⃣/1️⃣6️⃣ help India U19 restrict USA U19 to 107 👏
Over to our batters 🙌
Scorecard ▶️ https://t.co/AMFM5Bk4oI#U19WorldCup pic.twitter.com/Ro8Fy9Pkly
— BCCI (@BCCI) January 15, 2026