సిడ్నీ: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. వర్షానికి తోడు సరైన వెలుతురు లేని కారణంగా తొలి రోజు ఆట నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగిసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్..147/2 స్కోరు చేసింది. డేవిడ్ వార్నర్(10) నిరాశపర్చగా, ఉస్మాన్ ఖవాజ(54 నాటౌట్), మార్నస్ లబుషేన్(79) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. నోర్జె(2/26)కు రెండు వికెట్లు దక్కాయి. మూడు మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంతో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.