జోహాన్నస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టులో.. నాలుగవ రోజు వర్షం వల్ల ఆట ఆలస్యమవుతోంది. ప్రస్తుతం జోహాన్నస్బర్గ్లో స్వల్ప స్థాయిలో వర్షం కురుస్తోంది. గ్రౌండ్పై నిలిచిన నీటిని సూపర్సోపర్లతో తొలిగిస్తున్నారు. అయితే భోజన విరామ సమయం వరకు ఆట ప్రారంభం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం రెండవ టెస్టు రసపట్టులో ఉంది. 240 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడు రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది. ఎల్గర్ 46, రసీ వాండర్ 11 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఒకవేళ ఇండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే మిగితా 8 వికెట్లను త్వరగా తీయాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా తన గెలుపు కోసం 122 రన్స్ చేయాలి.