న్యూఢిల్లీ : రెజ్లర్ సాగర్ ధంఖర్ హత్య కేసులో అరెస్టయిన ఒలింపియన్ సుశీల్ కుమార్పై డిపార్ట్మెంటల్ చర్యకు రైల్వే సన్నాహాలు ప్రారంభించింది. సుశీల్ కుమార్ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర రైల్వే సీపీఆర్ఓ దీపక్ కుమార్ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చారు. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది. సుశీల్ కుమార్ నార్తర్న్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్గా నియమితులయ్యారు. 2015 నుండి ఢిల్లీ ప్రభుత్వంలో డిప్యుటేషన్లో ఉన్నారు. పాఠశాల స్థాయిలో క్రీడల అభివృద్ధి కోసం ఛత్రసాల్ స్టేడియంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డి) గా నియమితులయ్యారు.
గత ఏడాది అతడి డిప్యుటేషన్ కాలాన్ని రైల్వే అధికారులు పొడిగించారని, ఈ సంవత్సరం కూడా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోగా.. తిరస్కరించి దానిని తిరిగి ఉత్తర రైల్వేకు పంపారు. ఛత్రసాల్ స్టేడియంలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధంఖర్ను హత్య చేసిన కేసులో 18 రోజుల పాటు పరారీలో ఉన్న సుశీల్కుమార్తో పాటు మరో నిందితుడు అజయ్ను ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఢిల్లీ ప్రభుత్వ నివేదికను రైల్వే ఆదివారం అందుకున్నదని, సుశీల్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదవడంతో అతడిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ దీపక్ కుమార్ పేర్కొన్నారు.
సీబీఐ డైరెక్టర్ ఎంపిక : జస్టిస్ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు ఔట్..?!
అమరీందర్కు పక్కలో బళ్లెంలా సిద్దూ
నక్సల్స్ దాడిలో కాంగ్రెస్ నేతల మృతి.. చరిత్రలో ఈరోజు
‘హవానా సిండ్రోమ్’ : అమెరికాను కలవరపెడుతున్న మైక్రోవేవ్ దాడులు
కరోనా నియంత్రణకు కాక్టైల్ ఔషధాన్ని తీసుకొచ్చిన రోచె-సిప్లా
సహజంగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినండి..!
కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ పేరు కూడా..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..