కాన్పూర్: పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణిస్తున్న యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్కు టెస్టు జట్టు నుంచి పిలుపు వచ్చింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు దూరమవడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘తొడ కండరాల గాయం కారణంగా రాహుల్ టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. గాయం తగ్గాక రాహుల్ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో దక్షిణాఫ్రికా టూర్ కోసం సిద్ధమవుతాడు’అని తెలిపింది. తొలి టెస్టు వేదికైన కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో మంగళవారం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. నెట్ సెషన్లో వైస్ కెప్టెన్ చతేశ్వర్ పుజారా, శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.