ముంబై: న్యూజిలాండ్తో నేటి నుంచి ప్రారంభంకానున్న రెండవ టెస్టుకు అజింక్య రహానే, జడేజా, ఇశాంత్ శర్మలను దూరం పెట్టారు. కాన్పూర్ టెస్టులో ఇశాంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది. అదే టెస్టులో జడేజా కుడి చేతి మడిమకు కూడా గాయమైన విషయం తెలిసిందే. రహానేకు కూడా కాన్పూర్ టెస్టులో తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఈ ముగ్గురు ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. ఇక ఇవాళ ఉదయం 9.30 నిమిషాలకు ప్రారంభ కావాల్సిన మ్యాచ్ ఆలస్యమవుతోంది. వర్షం వల్ల ఇంకా టాస్ పడలేదు. ముంబైలోని వాంఖడే స్టేడియం చిత్తడి చిత్తడిగా మారింది. 10.30 నిమిషాలకు మళ్లీ అంపైర్లు పిచ్ను పరిశీలించనున్నారు. సెకండ్ ఇన్స్పెక్షన్ తర్వాత టాస్ వేయనున్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా గాయం వల్ల ముంబై టెస్టులో ఆడడం లేదు. అతని స్థానంలో లామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.