ఓవల్: కిక్కిరిసిన ఓవల్ స్టేడియంలో.. రహానే, శార్దూల్లు వీరయోధుల్లా పోరాడుతున్నారు. ఇండియాను ఫాల్ఆన్ గండం నుంచి ఆ ఇద్దరూ దాదాపు గట్టెక్కించారు. నిప్పులు చెరుగుతున్న ఆసీస్ బౌలర్లను మహావిరోచితంగా అడ్డుకున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇండియా మూడవ రోజు తొలి సెషన్లో భోజన విరామ సమయానికి ఆరు వికెట్ల నస్టానికి 260 రన్స్ చేసింది. రహానే 89, శార్దూల్ 36 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఫాల్ ఆన్ తప్పుకోవాలంటే భారత్ ఇంకా 10 రన్స్ చేయాల్సి ఉంటుంది.
Just the session #TeamIndia needed.
108* run partnership between Rahane and Shardul guides India to 260/6 at Lunch on Day 3 of the #WTC23 Final.
Scorecard – https://t.co/0nYl21oYkY… #WTC23 pic.twitter.com/8moNWsgFTL
— BCCI (@BCCI) June 9, 2023
ఇవాళ తొలి సెషన్లో 22 ఓవర్లు బౌల్ చేశారు. దాంట్లో ఇండియా వికెట్ నష్టపోయి 109 రన్స్ జోడించింది. ఉదయం భరత్ తొందరగా నిష్క్రమించాడు. అయితే శార్దూల్, రహానేలు మాత్రం ఆసీస్ పేస్ అటాక్ను ధీటుగా ఎదుర్కొన్నారు. బాడీ లైన్ బంతులు వేస్తున్నా ఆ ఇద్దరూ తమ శరీరాలను అడ్డుపెట్టి మరీ ఆడేశారు. శార్దూల్ ఆరంభంలో మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చేతులకు, శరీరానికి, తలకు బంతులు తగిలినా.. అతను మాత్రం తన నిబ్బరాన్ని కోల్పోలేదు.
A strong century stand between Ajinkya Rahane and Shardul Thakur keeps India on track 👊
Follow the #WTC23 Final 👉 https://t.co/qWUTpiCU4g pic.twitter.com/SmmAF1secf
— ICC (@ICC) June 9, 2023
రహానే సుప్రీం ఆటతీరును ప్రదర్శించాడు. అడపాదడపా క్లాసిక్ షాట్లతో చెలరేగాడు. కమ్మిన్స్, బోలాండ్, స్టార్క్ లాంటి పేస్ బౌలర్లను రహానే తనదైన స్టయిల్లో అటాక్ చేశాడు. శార్దూల్ కూడా ఆసీస్ పేస్ బౌలర్లకు ఎదురు నిలిచాడు. ఆ ఇద్దరూ ఏడో వికెట్కు అజేయంగా 108 రన్స్ జోడించారు.