అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ( Road Accident ) జరిగింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. సోంపేట మండలం బారువ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించే క్రమంలో లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.
దీంతో ఘటనా స్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతులు ఒడిశా వాసులుగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.