హైదరాబాద్ : బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన సింధు.. ఈసారి టోక్యోలో స్వర్ణం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. అయితే సింధుకు ఆమె పేరెంట్స్ బెస్ట్ విషెస్ చెప్పారు. ఒలింపిక్స్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఆ విషెస్ వీడియోను పోస్టు చేశారు. సింధుకు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చే వ్యవస్థ ఉన్నట్లు ఒలింపిక్స్ నిర్వాహకులు తమ ట్వీట్లో పేర్కొన్నారు.
హాయ్ సింధు.. అమ్మా, నాన ఇక్కడే ఉన్నాం.. నీ పట్ల గర్వంగా ఫీలవుతున్నాం, ఆల్ ద బెస్ట్ అంటూ సింధు తల్లి ఆ వీడియోలో తెలిపింది. ఇన్నాళ్లు చాలా శ్రమించావు, దేశం గర్వపడేలా పతకాన్ని తీసుకురావాలని తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గో ఫర్ గోల్డ్ ప్లకార్డుతో సింధుకు మద్దతు పలికారు. రియో తర్వాత జరిగిన అన్ని మేజర్ బ్యాడ్మింటన్ ఈవెంట్లలో సింధు మేటి ప్రదర్శన కనబరిచింది. ఈసారి ఒలింపిక్స్లోనూ మెరవనున్నట్లు షట్లర్ సింధు పేర్కొన్నది. 24వ తేదీ నుంచి బ్యాడ్మింటన్ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి.