సింగపూర్: సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్లో భారత యువ షట్లర్లు మిథున్ మంజునాథ్, అష్మితా చాలిహా సంచలన విజయాలు నమోదు చేసుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో మిథున్ 21-17, 15-21, 21-18తో ఏడోసీడ్ కిడాంబి శ్రీకాంత్పై గెలిచాడు.
గంటసేపు హోరాహోరీగా సాగిన పోరులో అన్సీడెడ్ మిథున్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మహిళల సింగిల్స్లో అష్మిత 21-16, 21-11తో బుసానన్(థాయ్లాండ్)పై గెలిచి ముందంజ వేసింది. మిగతా మ్యాచ్ల్లో పీవీ సింధు 21-15, 21-11తో లియానె ట్యాన్(బెల్జియం)పై అలవోకగా గెలువగా, ప్రణయ్ 21-13, 21-16తో సితికోను ఓడించాడు.