కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్స్లో ఏడో సీడ్ సింధు 21-12, 21-10తో జాంగ్ యీ మన్ (చైనా)పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్లో ప్రణయ్ 21-19, 21-16తో వాంగ్ జూ (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. శుక్రవారం జరుగనున్న క్వార్టర్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జూ యింగ్తో సింధు.. కెంటా సునెయమా (జపాన్)తో ప్రణయ్ తలపడనున్నారు. ఇతర మ్యాచ్ల్లో సాయి ప్రణీత్ 14-21, 17-21తో లీ షీ ఫెంగ్ చేతిలో.. కశ్యప్ 10-21, 15-21తో గింటింగ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.