రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేషియా ఓపెన్ క్వార్టర్స్లో ఓడింది. మలేషియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్ చేరిన ఆమె.. సెకండ్ సీడ్, చైనీస్ తైపీ క్రీడాకారిణి టై జు యింగ్ చేతిలో ఓటమి చవిచూసింది. మొత్తం 53 నిమిషాలపాటు సాగిన మ్యాచ్లో సింధు 13-21, 21-15, 21-13 పాయింట్ల తేడాతో ఓడింది.
అలాగే మరో భారత ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ కూడా మలేషియా ఓపెన్ క్వార్టర్స్లోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ఏడో సీడ్ జొనాథన్ క్రిస్టీ చేతిలో 21-18, 21-16 తేడాతో వరుస సెట్లు కోల్పోయిన ప్రణయ్.. ఇంటి దారి పట్టాడు. వీళ్లిద్దరూ నిష్క్రమించడంతో మలేషియా ఓపెన్లో భారత క్యాంపెయిన్ ముగిసినట్లయింది.