MI vs PBKS : ఐపీఎల్ పదిహేడో సీజన్లో 33 మ్యాచ్కు మరికాసేపట్లో తెరలేవనుంది. ముల్లన్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ సారథి సామ్ కరన్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ కీలక పోరలో ముంబై ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. పంజాబ్ రెండు మార్పులు చేసింది. వరుసగా విఫలమవుతున్న జానీ బెయిర్స్టో స్థానంలో రిలే రస్సో ఆడనున్నాడు.
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నబీ, గెరాల్డ్ కొయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా.
పంజాబ్ తుది జట్టు : రీలే రస్సో, ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కరన్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), లివింగ్స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబడ, అర్ష్దీప్ సింగ్.
మెగా టోర్నీలో చెరో రెండు విజయాలు సాధించిన ముంబై, పంజాబ్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. సొంత మైదానంలో రెండు విజయాలతో జోరు మీదున్న హార్దిక్ పాండ్యా సేనకు చెన్నై సూపర్ కింగ్స్ షాకిచ్చింది. మరోవైపు శిఖర్ ధావన్ గైర్హాజరీలో పంజాబ్ కింగ్స్ రాణించినా ఆఖరి ఓవర్ థ్రిల్లర్ రాజస్థాన్ విజేతగా నిలిచింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ముంబై, పంజాబ్లు ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి.