నేడు బెంగాల్తో టైటాన్స్ పోరు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: మూడేండ్ల విరామం అనంతరం ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. కొవిడ్-19తో గత రెండేండ్లుగా పీకేఎల్ మ్యాచ్లను భాగ్యనగరంలో నిర్వహించలేదు. శుక్రవారం నుంచి మూడో అంచె పోటీలు గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్నాయి. సొంతగడ్డపై అభిమానుల కోలాహలం మధ్య శుక్రవారం బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. పీకేఎల్ తొమ్మిదో సీజన్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్ ఒక మ్యాచ్ మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతున్నది. అయితే తిరిగి పుంజుకునే సత్తా టైటాన్స్కు ఉందని.. కోచ్ వెంకటేశ్ గౌడ్ అన్నాడు. అభిమానుల ఉత్సాహంతో జట్టు పునరుత్తేజం చెందడం పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.