న్యూఢిల్లీ: ముననుపెన్నడూ లేని విధంగా ప్రతిష్ఠాత్మక డెఫిలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు కొల్లగొట్టిన అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పతకాలు సాధించిన ఆటగాళ్లతో ఈ నెల 21న తన నివాసంలో భేటీ కానున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.
బ్రెజిల్ వేదికగా ఇటీవల ముగిసిన బధిరుల విశ్వక్రీడల్లో భారత అథ్లెట్లు.. 8 స్వర్ణాలు, ఒక రజతం, 8 కాంస్యాలు చేజిక్కించుకున్నారు. ‘డెఫ్లింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత బృందానికి అభినందనలు. మీలో ప్రతి ఒక్కరూ తోటి పౌరులకు స్ఫూర్తిదాయకం. ఈ నెల 21న మీ అందరితో కలుస్తా’ అని మోదీ ట్వీట్టర్లో పేర్కొన్నారు.