Singapore Open : సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ తొలి రౌండ్లోనే భారత స్టార్ షట్లర్లకు పెద్ద షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్లోహెచ్హెస్ ప్రణయ్(HS Prannoy), మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ పీవీ. సింధు(PV Sindhu) అనూహ్యంగా ఓడిపోయారు. వరల్డ్ నంబర్ 2 అకనే యమగుజి(జపాన్) 21-18 19-21 17-21తో సింధుపై గెలుపొందింది. గంట పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో సింధు మొదటి సెట్ గెలిచింది. ఆ తర్వాత పుంజుకున్న యమగుజి రెండు సెట్లలో ఆధిక్యం కనబరిచి విజేతగా నిలిచింది.
మలేషియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన ప్రణయ్ ఫేవరెట్గా బరిలోకి దిగాడు. టైటిల్ లక్ష్యంగా పెట్టుకున్న అతడు తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టాడు. అతడిని 15వ సీడ్ కొడాయ్ నరావ్క(జపాన్) అద్భుతంగా ఆడడంతో ప్రణయ్ చేతులెత్తేశాడు. వరుస సెట్లలో 15-21 19-21అతను ఓడిపోయాడు.
సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత్కు గొప్ప ఊరట ఏంటంటే..? తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. కంటఫోన్ వాంగ్చరోన్పై 21-15 21-19తో విజయం సాధించాడు. కెంట నిషిమొటో(జపాన్), చియా హావ్ లీ(చైనీస్ తైపీ) మ్యాచ్ విజేతతో అతడు రెండో రౌండ్లో తలపడనున్నాడు.