INDW vs AUSW : సొంత గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు(Womens cricketTeam) తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇంగ్లండ్ను 347 పరుగులతో చిత్తు చేసిన హర్మన్ప్రీత్ కౌర్(Harmanprit Kaur) సేన ఆస్ట్రేలియాను హడలెత్తిస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత బౌలర్లు మరోసారి తమ తడాఖా చూపించారు. వస్త్రాకర్,స్నేహ్ రానా దెబ్బకు కంగారూ జట్టు 219 పరుగులకే కుప్పకూలింది.
ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వికెట్ కోల్పోకుండా పరుగులు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ(28), స్మృతి మంధానా(30) ధాటిగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 152 పరుగులు వెనకబడి ఉంది.
The tourists have been bowled out for a modest total at the Wankhede 🏏#INDvAUS 📝: https://t.co/JKwX67S7dI pic.twitter.com/oBzRffJiTB
— ICC (@ICC) December 21, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా ఆది నుంచి తడబడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫొబే లిచ్ఫీల్డ్(0) రనౌటయ్యింది. ఆ తర్వాతి ఓవర్లోనే డేంజరస్ ఎలిసా పెర్రీ(4)ని పూజా వస్త్రాకర్ వెనక్కి పంపింది. బేత్ మూనీని(40 ), సథర్లాండ్(16) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు తీస్తూ కంగారూలను ఒత్తిడిలోకి నెట్టారు. వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రానా మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ను కోలుకోలేని దెబ్బతీశారు. దాంతో, ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 219 పరుగులకే ఆలౌటయ్యింది.