London | లండన్ : గత గురువారం అదృశ్యమైన భారతీయ విద్యార్థి లండన్ లేక్లో శవమై తేలాడు. ఈస్ట్ లండన్లో ఉన్న ఓ రివర్లో విద్యార్థి గురష్మాన్ సింగ్ భటియా మృతదేహాన్ని పోలీసు డైవర్స్ వెలికి తీశారు. భటియా ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా తోసేశారా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు యూకే మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలతో పాటు అతని ఫోన్ కాల్స్ను పరిశీలిస్తున్నామని చెప్పారు.
భటియా గత గురువారం(డిసెంబర్ 14) తన స్నేహితులతో కలిసి నైట్ ఔట్కు వెళ్లినట్లు సమాచారం. డిసెంబర్ 15 నుంచి అతను కనిపించకుండా పోయాడు. డిసెంబర్ 14 సాయంత్రం, 15న ఉదయం భటియాను ఎవరైనా మార్స్ వాల్ ఏరియాలో ఎవరైనా చూసి ఉంటే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. భటియా చివరిసారిగా కనిపించిన వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. భటియా లండన్లోని లాగ్బోరోగ్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ డిజిటల్ ఫైనాన్స్ విద్యను అభ్యసిస్తున్నాడు.