IND vs RSA : సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా, భారత జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ మర్క్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, భారత్ మరోసారి తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఐపీఎల్లో అదరగొట్టిన ఆర్సీబీ ప్లేయర్ రజత్ పటిదార్ అరంగ్రేటం చేయనున్నాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో చాహల్ జట్టులోకి వచ్చాడు.రెండో వన్డేలో గెలుపొంది సఫారీ జట్టు ఏ మార్పులు లేకుండా ఆడనుంది.
భారత్ తుది జట్టు : కెఎల్ రాహుల్ (కెప్టెన్), రజత్ పటిదార్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, యజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్
దక్షిణాఫ్రికా తుది జట్టు : టోని డి జార్జి, రీజా హెండ్రిక్స్, రస్సీ వాండర్ డసెన్, ఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, కేశవ్ మహారాజ్, నండ్రె బర్గర్, లిజాడ్ విలియమ్స్, బెరూన్ హెండ్రిక్స్