పాట్నా: వైభవ్ సూర్యవంశీ .. ఐపీఎల్లో సెన్షేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ 14 ఏళ్ల కుర్రాడు.. ఈ యేటి ఐపీఎల్లో సెంచరీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఆ టీనేజర్ను ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) కలుసుకున్నారు. బీహార్ పర్యటనలో ఉన్న మోదీ.. పాట్నా విమానాశ్రయంలో వైభవ్ను మీట్ అయ్యారు. వైభవ్ పేరెంట్స్ కూడా మోదీని కలిశారు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశి వీర ప్రతాపం చూపించి కేవలం 35 బంతుల్లో సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే.
ప్రధాని మోదీని కలిసిన సమయంలో.. ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు వైభవ్. యంగ్ క్రికెటర్ను కలిసిన విషయాన్ని ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. యువ సంచలన క్రికెటర్, అతని కుటుంబాన్ని పాట్నా ఎయిర్పోర్టులో కలుసుకున్నట్లు ఆ పోస్టులో రాశారు. వైభవ్ క్రికెట్ నైపుణ్యాన్ని యావత్ దేశం కీర్తిస్తున్నదని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు.
ఐపీఎల్లో ఏడు మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశి మొత్తం 252 రన్స్ స్కోర్ చేశాడు. అయితే జైపూర్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై అతను చెలరేగిన తీరు అద్వితీయం. తన స్ట్రోక్ ప్లేతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడతను.
At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours. pic.twitter.com/pvUrbzdyU6
— Narendra Modi (@narendramodi) May 30, 2025
Read More..