న్యూఢిల్లీ: ఇండియన్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్.. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. బుధవారం 64-69 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సూర్మనెలి చేతిలో 0-5తో లవ్లీనా ఓడిపోయింది. బ్రాంజ్ మెడల్కు పరిమితమైన లవ్లీనాకు ప్రధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు. అద్భుతంగా పోరాడవు లవ్లీనా.. బాక్సింగ్ రింగులో ఆమె సాధించిన సక్సెస్ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని మోదీ తన ట్విట్టర్లో తెలిపారు. ఆమె పట్టుదల ఆమోఘమన్నారు. లవ్లీనా భవిష్యత్తులో మరింత రాణించాలని ప్రధాని తన ట్వీట్లో కోరారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా బాక్సర్ లవ్లీనాకు కంగ్రాట్స్ తెలిపారు. అస్సాం కూతురు లవ్లీనా టోక్యో ఒలింపిక్స్లో పతకం గెలిచిందని, అస్సామీ చరిత్రలో నీ పేరును సువర్ణాక్షరాలతో రాస్తారని, ఆమె సాధించిన ఘనత పట్ల యావత్ దేశం గర్వంగా ఫీలవుతున్నట్లు సీఎం హిమంత శర్మ తెలిపారు.
లవ్లీనా తండ్రి టికెర్ బోర్గోహైన్ కూడా స్పందించారు. తన కూతురికి బ్రాంజ్ మెడల్ రావడం సంతోషంగా ఉందన్నారు. తన కూతురి మ్యాచ్లను లైవ్లో చూడనన్నారు. ఆమెను రిసీవ్ చేసుకునేందుకు గౌహతి విమానాశ్రయానికి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. గోల్డ్ మెడల్ గెలవడం ఆమె లక్ష్యమని, కానీ ఈ ఫలితంతో ఆమె బహుశా నిరాశకు గురై ఉంటుందని టికెన్ వెల్లడించారు.