టోక్యో: ఒలింపిక్స్లో వరుసగా రెండో మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించారు. సింధు దేశానికే గర్వకారణం.. అత్యద్భుతమైన ఒలింపియన్లలో ఆమె కూడా ఒకరు అని మోదీ ట్వీట్ చేశారు. అటు రాష్ట్రపతి కోవింద్ కూడా ఒలింపిక్స్లో రెండో మెడల్ గెలిచిన సింధును అభినందిస్తూ ట్వీట్ చేశారు. నిలకడకు, అంకితభావానికి ఆమె మారుపేరుగా నిలుస్తోందని కొనియాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో సింధు.. చైనాకు చెందిన హి బింగ్జియావోపై 21-13, 21-15 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.