ODI WC 2023: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) షెడ్యూల్ రానే వచ్చింది. ముంబైలో ఈరోజు ఐసీసీ(ICC) , బీసీసీఐ(BCCI) పెద్దలు వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేశారు. భారత్ వేదికగా అక్టోబర్ 5న తొలి మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మెగా టోర్నీలో ఆడడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) మాత్రం ఇంకా తమ నిర్ణయం వెల్లడించలేదు. రెండు వేదికలను మార్చాలన్న పీసీబీ అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చడమే అందుకు కారణం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే… ?
వరల్డ్ కప్లో ఆడడంపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ విషయాన్ని పీసీబీ మీడియా ప్రతినిధి ఒకరు వెల్లడించాడు. భారత పర్యటనకు వెళ్లాలంటే పాక్ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అంతేకాదు మ్యాచ్ వేదికలపై కూడా గవర్నమెంట్ నిర్ణయం తెలుసుకుంటాం. ప్రభుత్వం నుంచి స్పందన రాగానే ఐసీసీకి తెలియజేస్తాం అని అతను తెలిపాడు.
GET YOUR CALENDARS READY! 🗓️🏆
The ICC Men’s @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/dakTklwcYe
— ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023
వరల్డ్ కప్ డ్రాఫ్ట్ షెడ్యూల్ రాగానే అహ్మదాబాద్ వేదికపై పాక్ క్రికెట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్, పాక్ మ్యాచ్ను చెన్నై లేదా బెంగళూరులో నిర్వహించాలని ఐసీసీకి విన్నవించింది. అంతేకాదు అఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ వేదికను సైతం మార్చాలని కోరింది. కానీ,.. మరోవైపు.. వరల్డ్ కప్ల్ పాక్ కచ్చితంగా ఆడుతుందని బీసీసీఐ, ఐసీసీ పెద్దలు నమ్మకంతో ఉన్నారు. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ జట్టు అక్టోబర్ 6న క్వాలిఫైయర్ 1 మ్యాచ్ హైదరాబాద్లో ఆడనుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.