PCB : పాకిస్థాన్ క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ దేశ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు శహర్యార్ ఖాన్(Shaharyar Khan) కన్నుమూశాడు. రెండు పర్యాయాలు పీసీబీ బాస్గా సేవలందించిన ఖాన్ శనివారం 89 ఏండ్ల వయసులో ప్రాణాలు విడిచాడు. దాంతో, పాక్ మాజీ ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేశారు. ‘పీసీబీ తరఫున ఖాన్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఒక మంచి పరిపాలకుడు. పాకిస్థాన్ క్రికెట్కు నిబద్ధతతో సేవలందించాడు’ అని పీసీబీ ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు.
The PCB, through its Chairman, Board of Governors and employees, expresses deep sadness over the passing of former Chairman PCB Shaharyar Khan. Our heartfelt condolences to his family and friends. pic.twitter.com/IOmJWAJLu3
— Pakistan Cricket (@TheRealPCB) March 23, 2024
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగానే కాదు పలు హోదాల్లోనూ శహర్యార్ ఖాన్ పనిచేశాడు. 2003 నుంచి 2006 మధ్య ఒకసారి, 2014 నుంచి 2017 మధ్య మరోసారి పీసీబీ చైర్మన్గా కొనసాగాడు. ఆ దేశ జాతీయ జట్టుకు మేనేజర్గా, పాక్ ప్రభుత్వంలో విదేశీ వ్యవహరాల సెక్రటరీగానూ ఖాన్ తన సేవలు అందించాడు. అంతేకాదు 1990లో పాక్ జట్టు చారిత్రాత్మక భారత పర్యటనలో ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ఆ ఏడాది టీమిండియా, పాక్ రెండు టెస్టులు ఆడాయి. తొలి మ్యాచ్లో పాక్ గెలుపొందగా.. రెండో టెస్టులో భారత జట్టు 212 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లాహోర్లో చనిపోయే సమయానికి అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.