Maidaan Movie | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మైదాన్. ఇండియన్ లెజెండరీ ఫుట్బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్ సంస్థ, బోనికపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా.. ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్ హీరోయిన్ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సినిమాలో అబ్దుల్ రహీమ్గా అజయ్ దేవగణ్ నటిస్తుండగా.. అతడి భార్య పాత్రలో హీరోయిన్గా కోలీవుడ్ నటి కీర్తి సురేశ్ అనుకున్నాం. కానీ ఆ సమయంలో కీర్తి బాగా బరువు తగ్గింది. కానీ ఈ పాత్రకు కొంచెం బరువు కలిగి ఉండాలి. అందుకే ప్రియమణిని ఎంచుకున్నాం అంటూ అమిత్ వెల్లడించారు.
భారత ఫుట్బాల్లో స్వర్ణయుగంగా భావించే 1950-1963 మధ్య కాలంలో మన జట్టుకు కోచ్గా వ్యవహరించిన సయిద్ అబ్దుల్ రహీమ్ జీవితంలోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. 2020లోనే మొదలైన ఈ సినిమా పలు అవాంతరాలను అధిగమించి ఎట్టకేలకు ఈ రంజాన్కు విడుదలవనుంది.