Alla Ramakrishna Reddy | ఏపీలో అధికారిక వైసీపీని ఓడించాలని ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన-బీజేపీ ఒక్కటై కూటమిగా వైసీపీపై పోటీకి దిగుతున్నాయి. ఈ క్రమంలో వాళ్లకు దొరికిన ప్రతి ఛాన్స్ను వినియోగించుకుంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారని ఎమ్మెల్యే ఆర్కే ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి అభివృద్దిపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలే అని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్లుగా మంగళగిరి అభివృద్దిపై బహిరంగ చర్చ అవసరమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కడ జరిగిన అభివృద్ధి గురించి ఏ వీధిలోకి వెళ్లినా సరే ప్రజలే చెబుతారని స్పష్టం చేశారు.