డ్యునెడిన్: న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన టీ20 సిరీస్ను గెలుచుకుని పాకిస్థాన్ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్ మహిళలకు కివీస్ను వారి దేశంలో ఓడించడం ఇదే ప్రథమం. మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు 10 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్ను 7 వికెట్ల తేడాతో గెలుచుకున్న పాకిస్థాన్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.
తొలుత పాక్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. మునీబా అలీ 35, అలియా రియాజ్ 32నాటౌట్, మరూఫ్ 21 పరుగులతో రాణించారు. ఫ్రాన్ జొనాస్, మోలి పెన్ఫోల్డ్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. హన్నా రో అత్యధికంగా 33 పరుగులు చేయగా, జార్జియా పిల్మర్ 28 పరుగులు చేసింది. ఫాతిమా సన 3, సాదియా ఇక్బాల్ 2 వికెట్లు కూల్చారు. ఇక నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ శనివారం జరుగుతుంది.