రావల్పిండి: పరుగుల వరద పారుతున్న రావల్పిండి టెస్టులో పాకిస్థాన్ విజయానికి 263 పరుగుల దూరంలో నిలిచింది. 343 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య పాకిస్థాన్.. ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 499/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్.. 579 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ స్పిన్నర్ విల్ జాక్స్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ 264/7 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బ్రూక్ (87), రూట్ (73), క్రాలీ (50) రాణించారు.