ఢాకా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. సోమవారం జరిగిన ఆఖరి పోరులో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. మహమ్మద్ నయీమ్ (47) మినహా తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో వసీమ్, ఉస్మాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. హైదర్ అలీ (45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మహమ్మద్ రిజ్వాన్ (40) ఆకట్టుకున్నారు.