న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ సిద్ధమైనట్లు సమాచారం. భారత్లో పర్యటించేందుకు అవసరమైన ట్రావెల్స్ క్లియరెన్స్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్కు లేఖ రాసింది.
ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేండ్లుగా భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్ల్లో పాల్గొనడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఎదురుపడుతున్నాయి.