వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అంతేకాకుండా వరల్డ్ కప్ 2023లో మొదటి మ్యాచ్ సైతం మోదీ స్టేడియంలోనే జరగనుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్లు తలపడనున్నాయి.
భారత్ తన మొదటి మ్యాచ్ను ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో అక్టోబర్ 15న తలపడనుంది. వరల్డ్ కప్ ఫైనల్ను నవంబర్ 19న మొతెరాలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది.
భారత్లో పర్యటించనున్న పాక్.?: వరల్డ్ కప్ 2023కి సంబంధించి ఐపీఎల్ తర్వాత అధికారిక షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా పాకిస్థాన్ వరల్డ్ కప్ కోసం భారత్లో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లీగ్ స్టేజ్లో పాకిస్థాన్ తన మ్యాచ్లను అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆడనుంది. బీసీసీఐ పాకిస్థాన్ మ్యాచ్లను ఎక్కువగా దక్షిణ భారతంలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే సౌత్ ఇండియా పిచ్లపై పాక్కు మంచి రికార్డు ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ షెడ్యూల్ రూపొందించనుంది. వన్డే వరల్డ్ కప్ మొత్తం 12 వేదికలుగా జరగనుంది. వాంఖడేలో సెమీ ఫైనల్ నిర్వహించనున్నారు. ప్రతి టీం 9 లీగ్ మ్యాచులు ఆడుతుంది.
వరల్డ్ కప్లో మొత్తం 10 టీంలు 48 మ్యాచ్లు ఆడనున్నాయి. 8 టీంలు నేరుగా వరల్డ్ కప్నకు క్వాలిఫై అవుతాయి. ఈ 8 టీంలు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడుతాయి. మిగిలిన రెండు స్థానాల కోసం జూన్ – జులైలో లీగ్ మ్యాచ్లను జింబాబ్వేలో నిర్వహిస్తారు. ఈ లీగ్లో శ్రీలంక, వెస్టీండీస్తో పాటు నెదర్లాండ్స్, ఐర్లాండ్, నేపాల్, ఒమన్, స్కాంట్లాండ్, యూఏఈ, జింబాబ్వే పోటీపడుతాయి.