IND vs ENG 5th Test : ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు(Team India) భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. టాపార్డర్ మంచి పునాది వేయడంతో ఆ తర్వాత వచ్చిన వాళ్లు దంచేస్తున్నారు. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న దేవ్దత్ పడిక్కల్(65 : 103 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో బాదాడు.
టీ తర్వాత షోయబ్ బషీర్ ఓవర్లో సిక్సర్తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ కాసేపటికే బషీర్ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. రాంచీ టెస్టు హీరో ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(6) పరుగులతో ఆడుతున్నాడు. దాంతో, టీమిండియా 4 వికెట్ల నష్టానికి 400 రన్స్ కొట్టింది. ప్రస్తుతం రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్లో 185 పరుగుల ఆధిక్యంలో ఉంది.
🎥 That Maiden Test Fifty Moment! 🙌
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @devdpd07 | @IDFCFIRSTBank pic.twitter.com/NLSSZ9TjCC
— BCCI (@BCCI) March 8, 2024
తొలి రోజు ఇంగ్లండ్ను 218 పరుగులకే కట్టడి చేసిన భారత్.. రెండో రోజు పట్టు బిగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(103 162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్మన్ గిల్(110 150 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. కానీ, లంచ్ తర్వాత 4 పరుగుల తేడాతో ఈ ఇద్దరూ ఔటయ్యారు.
ఆ సమయంలో సర్ఫరాజ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అరంగేట్రం కర్రాడు పడిక్కల్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ సీరీస్లో మూడో ఫిఫ్టీ బాదిన సర్ఫరాజ్ ఖాన్(56) టీ తర్వాత తొలి బంతికే ఔటయ్యాడు. బషీర్ బౌలింగ్లో స్లిప్లో రూట్ చేతికి చిక్కాడు.