యోచియోన్: ఆర్చరీ వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్-2లో భారత్కు మన ఆర్చర్లు మరో పతకం ఖాయం చేశారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ, ప్రియాన్షు ఫైనల్కు దూసుకెళ్లడంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరినైట్టెంది. సెమీస్లో భారత జోడీ 158-157తో కొరియాకు చెందిన హాన్ సుయింజియోన్, యంగ్ జేవొన్ను ఓడించి ఫైనల్స్కు అర్హత సాధించారు.
శనివారం జరుగబోయే తుది పోరులో భారత ద్వయం యూఎస్ఏ ఆర్చర్లు ఒలివియా డీన్-సవ్యైర్ను ఢీకొననున్నారు. ఈ టోర్నీలో భారత మహిళల కాంపౌండ్ జట్టు ఇది వరకే ఫైనల్ చేరిన విషయం విదితమే. సీనియర్ ఆర్చర్ దీపికా కుమారి, ప్రథమేశ్ సైతం సెమీస్ చేరుకున్న నేపథ్యంలో వీరిపైనా భారీ ఆశలున్నాయి.