హైదరాబాద్: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ చాంపియన్షిప్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పురుషుల జట్టు విజేతగా నిలిచింది. దశాబ్ద కాలంలో ఓయూ టీమ్ టైటిల్ గెలువడం ఇది తొలిసారి. చివరిసారి 2013లో కాంస్య పతకం గెలిచింది. గురువారం జరిగిన ఫైనల్ పోరులో ఉస్మానియా పురుషుల టీమ్ 3-2 తేడాతో ఆతిథ్య శ్రీ రామస్వామి స్మారక ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ)పై విజయం సాధించింది.