IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్(England) జట్టు దీటుగా బదులిస్తోంది. రెండో రోజు టీమిండియాను 396 పరుగులకే ఆలౌట్ చేసిన స్టోక్స్ సేన అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు బెన్ డకెట్(17), జాక్ క్రాలే(15) బజ్బాల్ ఆటతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో, లంచ్ సమయానికి ఆరు ఓవర్లలోనే ఇంగ్లండ్ 5.33 రన్రేటుతో 32 రన్స్ కొట్టింది. తొలి ఇన్నింగ్స్లో స్టోక్స్ సేన ఇంకా 364 పరుగులు వెనకబడి ఉంది.
తొలి రోజు సెంచరీతో కదం తొక్కిన టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్(209 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. అయితే.. టెయిలెండర్లను ఇంగ్లండ్ బౌలర్లు చకాచకా ఔట్ చేయడంతో 396 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
Rehan Ahmed and Shoaib Bashir halt India before 400
India fans, thoughts about the total? 🤔https://t.co/ZsyelyZUeZ | #INDvENG pic.twitter.com/qMwHIH6fGv
— ESPNcricinfo (@ESPNcricinfo) February 3, 2024
ఓవర్ నైట్ స్కోర్ 179తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన ఈ యంగ్స్టర్ కెరీర్తో తొలి ద్విశతకం సాధించాడు. బషీర్ బౌలింగ్లో వరుసగా సిక్స్, ఫోర్తో కెరీర్లో తొలి రెండంకెల స్కోర్ నమోదు చేశాడు. ఆ కాసేటికే అండర్సన్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. అప్పటికీ భారత్ స్కోర్ 383. ఆ తర్వాత బషీర్, రెహాన్ అహ్మద్ దెబ్బకు మరో 16 పరుగులకే రోహిత్ సేన కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, బషీర్, రెహాన్ అహ్మద్లు తలా మూడేసి వికెట్లు తీశారు.