Stuart Broad | ఇంగ్లండ్కు చెందిన గొప్ప పేసర్లలో ఒకడైన స్టువర్ట్ బ్రాడ్ నేటితో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు అనంతరం క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెబుతున్నట్టు బ్రాడ్ ఇప్పటికే ప్రకటించాడు. రైటార్మ్ పేసర్ అయిన బ్రాడ్ ఖాతాలో 840 అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి. 2016లో చివరిసారి వన్డే ఆడిన బ్రాడ్ టెస్టు క్రికెట్ మాత్రం రెగ్యులర్గా ఆడుతున్నాడు. టెస్టు క్రికెట్లో 600 వికెట్లు సాధించిన బ్రాడ్ అత్యధిక వికెట్లు సాధించిన జేమ్స్ అండర్సన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
స్టువర్ట్ బ్రాడ్ ఒకప్పుడు ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)కు ప్రాతినిధ్యం వహించిన సంగతి చాలామందికి తెలియదు. అప్పట్లో అతడిని దాదాపు 3కోట్ల రూపాయలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. అయితే, ప్రపంచకప్ సమయంలో సైడ్ స్ట్రెయిన్ కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతి ఏడాది కూడా జట్టు అతడిని రిటైన్ చేసుకున్నప్పటికీ గాయం కారణంగా ఇండియా రాలేకపోయాడు. ఆ తర్వాత మరెప్పుడూ ఐపీఎల్ వేలంలో పాల్గొనలేదు. గాయం కారణంగా ఒకసారి జట్టుకు దూరమైన బ్రాడ్ ఆ తర్వాత ఎప్పుడూ ఐపీఎల్ కోసం ఇండియాలో కాలుమోపలేదు. ఫలితంగా ఐపీఎల్ అభిమానులు అతడిని ఆటను చూడలేకపోయారు.