Neeraj Chopra : మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడనున్న భారత జట్టును ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కలిశాడు. జట్టు సభ్యులకు విలువైన సందేశం ఇచ్చి, వాళ్లలో స్ఫూర్తి నింపాడు. మ్యాచ్ ఆసాంతం ఆత్మవిశ్వాసంతో ఉండాలని చెప్పడంతో పాటు ఒత్తిడిలో ఎలా ఆడాలి? అనేది వివరించాడు. అంతేకాదు టీమిండియా జెర్సీ వేసుకొని వాళ్లతో కలిసి ఫొటోలకు పోజిచ్చాడు. నీరజ్, భారత జట్టుతో దిగిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. ‘అత్యంత విలువైన సమావేశం. జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ ముందు భారత జట్టుతో ముచ్చటించాడు’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది.
ఈరోజు జరగబోయే టైటిల్ పోరులో యువ భారత్, ఇంగ్లండ్ను ఢీ కొట్టనుంది. షెఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా సెమీఫైనల్లో కివీస్ను 8 వికెట్లతో చిత్తు చేసింది. రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను ఓడించింది. మహిళల అండర్ -19 టీ20 వరల్డ్ కప్ను ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తోంది. దాంతో, ప్రతిష్ఠాత్మకమైన ఈ ట్రోఫీని నెగ్గాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది.
తొలి అథ్లెట్ నీరజ్ చోప్రా
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత్కు బంగారు పతకం అందించాడు. ఫైనల్లో అతను 87.58 మీటర్ల దూరం జావెలిన్ విసిరి చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
A Gold-standard meeting! 👏👏
Javelin thrower & Olympic Gold medallist @Neeraj_chopra1 interacted with #TeamIndia ahead of the #U19T20WorldCup Final! 👍 👍 pic.twitter.com/TxL5afL2FT
— BCCI (@BCCI) January 28, 2023