ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల మున్సిపాలిటీలో
జడ్చర్ల, ఏప్రిల్13: పట్టణంలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే బస్తీబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం బస్తీబాటలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీలోని బాలాజీనగర్, కుమ్మరివాడ, నాగసాల వార్డుల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. మురుగుకాలువలు, సీసీరోడ్లు నిర్మించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేను కోరారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలని, మురుగుకాలువలు, సీసీరోడ్ల నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, బస్తీబాటలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాకనెక్షన్లు ఇచ్చే పనులు జరుగుతున్నాయని, పూర్తయ్యాక ప్రతి రోజూ తాగునీరు వస్తుందన్నారు. ఇండ్లు లేని పేదలందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామన్నారు. ఇంటిస్థలాలు ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన మా దవాఖానను మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్.సి.లక్ష్మారెడ్డి ప్రారంభించి, రోగులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించారు.
మినీ కల్యాణ మండపం ప్రారంభం
బాదేపల్లి పాతబజార్లో నిర్మించిన మినీ కల్యాణ మండపాన్ని బుధవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రూ.35లక్షల నిధులతో పాతబజార్ హనుమాన్దేవాలయ ప్రాంగణంలో మినీ కల్యాణ మండపాన్ని నిర్మించారు.
మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం జడ్చర్లలో పర్యటించనున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో సంగీతనాటక అకాడమీ చైర్మన్ బాద్మిశివకుమార్, కమిషనర్ సునీత, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ జంగయ్య, దోరెపల్లి రవీందర్, శేఖర్రెడ్డి, ఇర్ఫాన్, బీకేఆర్, డాక్టర్లు శ్రీధర్రెడ్డి, నీలొఫర్, ఉడా, మాజీ వార్డు సభ్యులు ప్రీతం, సాగర్, ఇమ్మడియాదయ్య, జగదీశ్వరాచారి, కొండల్ ఉన్నారు.