PAK vs AUS | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో ఆతిథ్య దేశాన్ని ఎలాగైనా బద్నాం చేయాలని కంకణం కట్టుకున్న పాకిస్తాన్ మీడియా.. బెంగళూరులో జరిగిన అగ్ని ప్రమాదాన్ని కూడా వదలడం లేదు. శుక్రవారం (అక్టోబర్ 20) పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం బెంగళూరులో జరిగిన అగ్ని ప్రమాదాన్ని అక్కడి మీడియా సంస్థలు బాంబు పేలుళ్లుగా చిత్రీకరిస్తూ బీసీసీఐని బద్నాం చేసే కార్యక్రమాన్ని ఎత్తుకున్నాయి. భారత్పై బురదజల్లేందుకు గాను అబద్దాలను పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయి.
గురువారం ఉదయం మడ్పైప్ కేఫ్లో సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. వీటిని షేర్ చేస్తూ పలువురు పాకిస్తాన్ జర్నలిస్టులు.. ‘బ్రేకింగ్ న్యూస్ :బెంగళూరులో బాంబు పేలుళ్లు.. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ భద్రతపై అనుమానాలు.. బాబర్ టీమ్ సేఫ్గా ఉన్నట్టు సమాచారం..’ అంటూ ట్వీట్స్ వర్షం కురిపించారు.
ICC events in India:
2023 WC (ongoing)
2025 Women’s WC
2026 T20 WC
2029 CT
2031 WCPakistanis spreading misinformation about the cylinder blast ensured that:
1. They will cry & still won’t get visa for any of these.
2. Their team will face the wrath of crowd in each one of… pic.twitter.com/tx2WtytA1I
— Johns (@JohnyBravo183) October 18, 2023
ఈ ట్వీట్స్పై తాజాగా భారతీయ క్రికెట్ అభిమానులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. భారత్లో వన్డే ప్రపంచకప్ నిర్వహించడం ఇదే కొత్త కాదని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరిగిన సందర్భాలే లేవని, పాకిస్తాన్ మీడియా తమ దేశంలో మాదిరిగానే అంతటా ఉందని భ్రమించడం మానుకోవాలని హితువు పలుకుతున్నారు. పాకిస్తాన్ టీమ్ తో పాటు మీడియానూ టార్గెట్ చేస్తూ షేర్ చేస్తున్న ట్రోల్స్ కూడా పేలుతున్నాయి.