క్రైస్ట్చర్చ్: మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. వరుణుడు నీడలా వెంటాడిన సిరీస్లో ఆఖరిదైన మూడో మ్యాచ్ కూడా రద్దయ్యింది. దీంతో సిరీస్ను 1-0తో కివీస్ కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్..భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. వాషింగ్టన్ సుందర్(51), శ్రేయాస్ అయ్యర్(49) రాణించడంతో భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్(10) మరోమారు నిరాశపరిచాడు.
121 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియాను సుందర్ ఆదుకున్నాడు. లోయర్ అర్డర్ బ్యాటర్లతో కలిసి కీలక పరుగులు జోడించాడు. ఆడమ్ మిల్నే(3/57), టిమ్ సౌథీ(2/36) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కివీస్..వర్షంతో అంతరాయం కల్గించే సమయానికి 18 ఓవర్లలో 104/1 స్కోరు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్(57) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్(1/31) ఒక వికెట్ దక్కింది. ఎడతెరిపిలేని వర్షం మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించారు. టామ్ లాథమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది.