కొలంబో : ఐపీఎల్లో ప్రాతినిధ్యం కోసం నిరంభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్వోసీ) ఇవ్వనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేసిన కేసును ఫాస్ట్బౌలర్ నువాన్ తుషారా వెనకకు తీసుకున్నాడు. ఎన్వోసీ జారీ విషయంలో కోర్టును ఆశ్రయించిన తుషారా గురువారం కేసును ఉపసహరించుకున్నట్లు ప్రకటించాడు.
ఇప్పటికే లీగ్ సగం పూర్తయిన నేపథ్యంలో తన క్లయింట్ తుషారా..లంక బోర్డుతో వివాదానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు అతని తరఫు న్యాయవాది పేర్కొన్నాడు.