టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ యూ టర్న్ తీసుకున్నాడు. కోహ్లీని టీ20 జట్టు నుంచి ఎందుకు తొలగించరు? అంటూ కొంతకాలం క్రితం షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్.. పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత కోహ్లీ ఫామ్పై ఎలాంటి చింత లేదన్నాడు. కోహ్లీ ఆడిన కొన్ని షాట్లు చాలా ఇంపాక్ట్ చూపించాయని, ఈ షాట్ల విషయంలో మరింత కచ్చితంగా ఉండాలని సలహా ఇచ్చాడీ లెజెండ్.
కోహ్లీ ఫామ్లోకి వస్తున్నాడని, చాలా చక్కగా ఆడాడని కొనియాడాడు. తొలి బంతికే అవుట్ తప్పించుకోవడం లక్కీనే అని, కానీ తను అక్కడ ఉన్నానని ఆటతీరుతో చూపించాడని కపిల్ చెప్పాడు. కోహ్లీ యాటిడ్యూడ్ అంటే తనకు మొదటి నుంచి ఇష్టమేనని, అదే అతన్ని మిగతా వాళ్ల కన్నా గొప్ప ఆటగాడిని చేస్తుందని వివరించాడు.
నెలరోజులపైగా విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. పాకిస్తాన్తో మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్పై రెండో బంతికే రాహుల్ (0) వికెట్ కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని చూడచక్కని షాట్లు ఆడిన అతను.. 35 పరుగులు చేశాడు. ఆ తర్వాత జడేజా కూడా 35 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత జట్టులో ఇదే టాప్ స్కోర్ కావడం గమనార్హం.