ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఆదివారం దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్లో 250 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 34 ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. అంతకు ముందు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ముందు టీం ఇండియా 250 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేన్ విలియమ్సన్ 69 పరుగులతో క్రీజ్లో కొనసాగుతున్నా డెరిల్ మిచెల్, టామ్ లాథమ్ ఔటయ్యారు. రవీంద్ర జడేజా బౌలింగ్లో టామ్ లాథమ్ 14 పరుగులకు ఎల్బీడబ్యూ కావడంతో పెవిలియన్ బాట పట్టాడు. డెరిల్ మిచెల్ 17 పరుగులకు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కావడంతో వెనుదిరిగాడు.
తొలుత ఓపెనర్ రుచిన్ రవీంద్రను హార్దిక్ పాండ్యా నాలుగో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ బాట పట్టించాడు. హార్దిక్ పాండ్య వేసిన బంతికి అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి రుచిన్ రవీంద్ర పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోర్ 23/1. ఇక 12వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి వేసిన మూడో బంతిని ఆడబోయిన విల్ యంగ్ బౌల్డయ్యాడు. అప్పటికి విల్ యంగ్ మూడు ఫోర్లతో 22 పరుగులు చేశాడు.